ఏలూరు: జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

  • ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి భద్రత కల్పించడమే జనసేన లక్ష్యం – రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక 5వ డివిజన్ నాగేంద్ర కాలనీలో ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ కమ్యూనిటీ హాల్ నందు ఆశ్రమం వైద్యుల సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినీత జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వైద్యులు డా. అచ్యుత రామస్వామి, కంటి వైద్య నిపుణులు డాక్టర్. నాగఆకిల, కంటి వైద్య నిపుణులు అనురాగ్, ప్రసూతి వైద్యులు డాక్టర్ విష్ణువర్ధని, వైష్ణవి రోగులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యం పట్ల భద్రత కల్పించాలన్న దేశంతో పార్టీ అధినేత సూచనల మేరకు ఏలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలను తీసుకొని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని లక్ష్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మంగళవారం ఉదయం పి.ఎం.పి కమ్యూనిటీ హాల్ నుండి ఆశ్రమం ఆసుపత్రికి రోగులను తీసుకువెళ్లి అక్కడ పరీక్షలు జరిపి అవసరమైన మందులు అందజేసి, తిరిగి వారి ఇళ్లకు చేరవేయడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగి రెడ్డి కాశి నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎటించి ధర్మేంద్ర, సరళ, బొత్స మధు నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసరావు వీర మహిళలు 1టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత తదితరులు పాల్గొన్నారు.