వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

అల్లూరి జిల్లా పాడేరు మండలం గడ్డివలస, బూరుగుపుట్టు, కొత్తవూరు గ్రామల వివిధ పార్టీలకు చెందిన యువత మరియు ఇండిపెండెంట్ ఎక్స్ ఎంపీటీసీ అభ్యర్థి బోయిన సత్యరావు(కొత్తవూరు) గడ్డివలస వార్డు మెంబర్ సీదారి అప్పలకొండ పలువురు స్వచ్ఛందంగా జనసేన ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీ పాడేరు, అరకుపార్లమెంట్ ఇన్చార్జి డా.వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. పాంగి సురేష్ ఆధ్వర్యంలో గడ్డివలస గ్రామంలో జరిగిన ఈ సమావేశంలో గంగులయ్య మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీటి, డ్రైనేజి, రోడ్డు సమస్యలపై గ్రామస్తులను ఆడిగితెలుసుకున్నారు. అలాగే గిరిజనం మార్పుకోరుకుంటున్నారని రాష్ట్రంలో అరాచక పాలన గురించి యువతకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కచ్చితంగా సమస్యలపై పోరాటం చేస్తూనే బావితరాల భవిష్యత్ కొరకు బాధ్యతాయుతమైన రాజకీయాలు చేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో మండల జనసేన నాయకులు ఉపాధ్యక్షులు సాలేబు ఆశోక్, పాంగి సురేష్, మజ్జి సత్యనారాయణ, మజ్జి సంతోష్, కిల్లో అశోక్, తదితర జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.