శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల, డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీ, గోలగాని పేటకి చెందిన 30 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి నెల్లిమర్ల జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి లోకం మాధవి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు.