టీడీపీ సత్యాగ్రహ దీక్షకి పొన్నలూరు జనసేన నాయకుల సంఘీభావం

కొండెపి: మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సత్యాగ్రహ దీక్షలో భాగంగా కొండేపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలంలో అనుమోలు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షలో పాల్గొని నారా చంద్రబాబు నాయుడుకు మరియు వారి సతీమణి భువనేశ్వరికి పొన్నలూరు జనసేన పార్టీ సంఘీభావం తెలపడం జరిగింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని, అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు నిజాయితీని ఎవరు ఆపలేరు, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అని ముందుగానే గ్రహించిన ఈ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టి భయం పట్టుకుని, పుట్టుమచ్చ లాగా కేసులు అంటిపెట్టుకుని ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి, ఎటువంటి మచ్చలేని నీతి నిజాయితీ గల చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం ముమ్మాటికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, మార్పు మొదలైంది రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళల్లో వెలుగుల నింపాలి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము, ఆయన అడుగుజాడల్లో నడుస్తాము, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి మా పొన్నలూరు జనసైనికులు నడుంబిగించి, కంకణం కట్టుకుని, జనసేన మరియు టిడిపి విజయానికి కృషి చేస్తాము అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఐటీ విభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు, ఉపాధ్యక్షులు పెయ్యల రవికుమార్ యాదవ్, మరియు జనసైనికులు పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది.