చెప్పులతో ప్రవేశం! అహంకారమా? అజ్ఞానమా?

పెడన, కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో గురువారం నూతన సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించడం జరిగింది. హైందవ సంప్రదాయం ప్రకారం నూతన గృహప్రవేశం (నివాస, కార్యాలయం ఏదైనా కావచ్చు) చేసేటప్పుడు చెప్పులతో ప్రవేశించకూడదు. మీరు రాష్ట్రానికి మంత్రి కావచ్చనేమో గాని, దైవము ముందు సామాన్యులే. దయచేసి హైందవ సాంప్రదాయాలు మంట కలపొద్దు. వారి మనోభావాలను గాయపరచవద్దు. మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.