తురిమెళ్ళ గ్రామ పంచాయితీలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం

గిద్దలూరు నియోజకవర్గం: రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజక వర్గం, కంభం మండలం, తురిమెళ్ళ గ్రామ పంచాయితీలో డి.ఆర్.ఓ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ టీమ్ తో సీపీఐ గ్రంధాలయం దగ్గర జరిగిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో సి.పి.ఐ పార్టీ నాయుకులు, ఇంజినీర్ కోళ్ల రంగసాయి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ సాయన్న, ప్రస్తుత జె పి చెరువు జెడ్.పి.హెచ్ హెడ్ మాస్టర్ బత్తిని తిరుపతి, జనసేన పార్టీ రాచర్ల మండల అధ్యక్షుడు, జె పి చెరువు హైస్కూల్ విద్య కమిటీ చైర్మన్ పుట్ట. బాలకృష్ణ, జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు పాల్గొని, పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని ప్రతజ్ఞ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.