వీఆర్ఏల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన అరకు జనసేన

*జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ.

అరకు నియోజకవర్గం, గ్రామ సేవకుల సంఘం నాయకుల పిలుపు మేరకు రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే ఆయం మండలాల్లో జరుగుతున్న వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ, లక్ష్మణ్ రావు తదితరులు అరకులోయ మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా రామకృష్ణ మాట్లాడుతూ వీఆర్ఏ ల కోరుతున్న ప్రధాన న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నో కాలాన్నిబట్టి గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్న గ్రామ సేవకులకు ప్రభుత్వం తక్షణం స్పందించి వారి సమస్యలను తక్షణం పరిష్కారం చేయగలరని ఈ సందర్భంగా జనసేన పార్టీ వీఆర్ఏల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని చెప్పారు.