వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ళ సందర్భంగా.. జనసేన ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ళ గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా.. రెంటపాళ్ళ గ్రామ జనసేన పార్టీ పెద్దలు, కార్యకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, తవిటి భవన్నారాయనా, నాదెండ్ల నాగేశ్వరావు, సిరిగిరి పవన్ కుమార్, రంగిశెట్టి సుమన్ కుమార్, శిరిగిరి మణికంఠ, నామాల పుష్పలత, బత్తుల కేశవ్, విజయ్, సోమ శేఖర్, అంబటి రామసాయి, మరియు జనసైనికులు పాల్గొన్నారు.