త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: ఎంపి విజయసాయి రెడ్డి
విశాఖకు త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్లనుందని వైపిసి ఎంపి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలో వెళ్లే సంకేతాలు అందుతున్నాయన్నారు. ముహూర్తం ఇంకా నిర్ణయం కాలేదు కానీ రాజధాని త్వరలో విశాఖకు వెళ్లడం మాత్రం ఖాయమన్నారు.