ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన పితాని బాలకృష్ణ

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో పితాని బాలకృష్ణ ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జనవాణి కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఆయనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తీరు చాలా అమానుషం. లా అండ్ ఆర్డర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఒక ప్రజా నాయకుడిని కారు నుండి బయటకు రాకుండా అభిమానులకు అభివాదం చేయకుండా నిలువరించే ప్రయత్నంచేసారు. గతంలో మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం ఇదేవిధంగా ప్రవర్తిస్తే మీరు కనీసం వంద కిలోమీటర్లు అయిన పాదయాత్ర చేయగలిగేవారా? తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేయగలవు? రాష్ట్రంలో ఉన్న ఒక్క రాజధానికే దిక్కులేదు మూడు రాజధానులకి ఏ విధంగా న్యాయం చేయగలవు? వికేంద్రీకరణ పేరుతో అడ్డంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పై మూడు పెళ్లిళ్లు అంటూ మీరు చేస్తున్న కామెంట్లపై స్పందిస్తూ మీ చెల్లి విషయంలో అలా జరగలేదా ఎదుటివారిని అనే ముందు ఆలోచించు. మీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి పూర్తిగా న్యాయం జరగలేదు సంక్షేమ అభివృద్ధి పథకాల కన్నా మీరు మీ నాయకులచే పవన్ కళ్యాణ్ పై ఎక్కువ దృష్టి పెట్టి మాట్లాడించే తీరే ఇది ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్సిపి నాయకులు పితాని హెచ్చరిక పవన్ కళ్యాణ్ అనే ముందు ఆలోచించి మాట్లాడండి లేకపోతే ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి పండు, గోదశి పుండరీష్, గోలకోటి వెంకన్నబాబు, సాయిబాబా, దూడల స్వామి, యలమంచిలి బాలరాజు, పోలిశెట్టి కుమార్, నూకల మణి, గణేషుల శ్రీను, కడలి వెంకటేశ్వరావు, పాయిసం సాయి, గాలిదేవర బుల్లి తదితరులు పాల్గొన్నారు.