జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: బుధవారం రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో ఇటీవల మరణించిన త్సవటపల్లి నాగభూషణం తల్లి త్సవటపల్లి భాగ్యవతి చిత్రపటానికి నివాళులు అర్పించి నాగభూషణం ను కలసి ఆయనను ఓదార్చి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో మృతి చిందిన జక్క విజయ, మరియు పెరుచెర్ల ప్రసాదరాజు చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.. వీరి వెంట మండల అధ్యకులు మోకా బాలప్రసాద్ ,జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి పండు, ఐ.పోలవరం మండల అధ్యక్షులు ఎం. పురుషోత్తం, కాయల బలరాం, లంకెనపల్లి జమ్మి, పిల్లి గోపి, రంబాల చౌదరిబాబు, సంసాని పాండురంగ, బీమాల సూర్యనాయుడు, విత్తనాల అర్జున్, సి.ఎం మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.