క్రియాశీల వాలంటీర్లకు సభ్యత్వ కిట్లు అందచేసిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం నియోజకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఓట్లు నమోదు గురించి, తొలగించడం గురించి, మన బూత్ లో మనకు సంబంధం లేని ఓట్లు ఏమైనా ఉంటే వాటిని తొలగించేలా చూడాలని సూచించారు. అలాగే క్రియాశీల వాలంటీర్లకు సభ్యత్వం కిట్లు అందచేసి, ప్రతీ సభ్యుడికి కూడా కిట్టు అందజేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఉభయ తూర్పుగోదావరి జిల్లా మహిళా కో-ఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, ముమ్మిడివరం మండలం అధ్యక్షులు గోలకోటి వెంకటేశ్వరరావు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, తాళ్లరేవు మండలం అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఐటి టీమ్ నందిగోళ్ళ సత్య ప్రకాష్, సోషల్ మీడియా గాలిదేవర వినోద్, పిల్లి గోపి, సంసాని పాండురంగారావు, వి.ఎన్.ఆర్.బి ప్రసాద్, గిడ్డి రత్నశ్రీ, సలాది రాజా మాదాల శ్రీధర్, పితాని రాజు, కడలి కొండ, రాయపురెడ్డి బాబీ, సిద్దు, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, రామ కోటేశ్వరరావు, సోము కిషోర్, లంకెలపల్లి జమి, పెన్నాడ శివ, వంగా సీతారాం, నాతి నాగేశ్వరరావు, ఓగూరి నూతన్ బాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరమహిళలు పాల్గొన్నారు.