జోగిరమేష్ అనుచిత వ్యాఖ్యలపై పితాని ఘాటు స్పందన

ముమ్మిడివరం నియోజకవర్గం: అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన మీటింగ్ లో రాష్ట్ర మంత్రి జోగిరమేష్ అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ముమ్మిడివరంలోని ఆయన్ స్వగృహమందు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కాగ్ నివేదిక, బై జ్యూస్ సంవస్థపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి.. పదవి పోతుందనే అభద్రతాభావంతో తన సహాచరులతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అధికారం పోతుందనే డిప్రెషన్ లో మతి భ్రమించి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తనసీటు కాపాడుకునే ప్రయత్నంలో జగన్ భజన చేస్తూ పవన్ కళ్యాణ్ పై వ్యక్తి గత విమర్శలు చేస్తున్న జోగి రమేష్ వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటు. ఆరోపణలపై సరైన సమాధానం చెప్పకుండా నీచంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతాం. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అతని టీమ్ కు బై..బై..చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని పితాని పేర్కొన్నారు.