ఉద్యోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాల తీరుని ఖండించిన పోలవరం జనసేన

పోలవరం, అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ రద్దు చేస్తానని అవగాహనలేకుండా ప్రకటన చేసామని చెప్పడం ఎన్నో సంవత్సరాలు కష్టపడి పీజీలు, డిగ్రీలు, పీహెచ్‌డీలు, డీఎస్‌సీలు, ఐపీయస్‌లు చేసి సంపాదించిన మేధావి వ్యవస్థ ఇలా…. రెండు మూడేళ్ళ టెంపరరీ సలహాదారుల కోరల్లో నలిగిపోవడం నిజంగా దారుణం మేధావి ఉద్యోగి భాధలకు పర్యవసానం ఈ ప్రభుత్వం మునుముందు కళ్ళారా చూడబోతుంది ఉద్యోగుల న్యాయమైన చట్టపరమైన పోరాటానికి పూర్తి మద్దతుగా పోలవరం జనసేనపార్టీ ప్రకటించింది. ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యధర్శి కరాటం సాయి, జిల్లా కార్యధర్శి గడ్డమణుగు రవికుమార్‌, జిల్లా జాయింట్‌ సెక్రటరీ పాదం నాగకృష్ణ మద్దు తేజ, తుట్టి రామచంద్రం మరియు జనసేన పోలవరం నాయకులు కార్యవర్గం ప్రభుత్వాల తీరుని ఖండించడం జరిగింది. అలాగే ఉద్యోగులకు పోలవరం జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని భవిష్యత్తులో ఉద్యోగులు ఏదైనా కార్యక్రమం తలపెడితే సంఘీభావంగా మేమున్నామని హామీ ఇస్తున్నామని తెలియజేసారు.