పండుగలు సంస్కృతికి నిలయాలు: యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: పండుగలు సంస్కృతికి నిలయాలు అని డి.ఆర్.డి.ఏ మాజీ అధికారి రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు తెలియజేశారు. వినాయక పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని సరస్వతీపురం, మంగళమిట్ట, బలిజ పల్లె హరిజనవాడకు, విద్యుత్ నగర్ కు చెందిన యువత యల్లటూరు భవన్ లో శ్రీనివాసరాజును కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవ కమిటీ వారికి ఆయన విరాళాలు అందజేసి మాట్లాడుతూ గణపతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. శ్రీ మహాగణపతి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యల్లటూరు శివరామరాజు, శింగంశెట్టి నరేంద్ర, పివిఆర్ కుమార్ గణపతి ఉత్సవ కమిటీలు తదితరులు పాల్గొన్నారు.