మేము సైతం రిలే నిరాహార దీక్షకు గునుకుల కిషోర్ మద్దతు

నెల్లూరు: జనసేన, టిడిపిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ జనసేన జిల్లా ప్రధాన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తన కార్యవర్గంతో టిడిపి కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలియజేస్తున్న ముఖ్య నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎక్కడ చూసినా దోపిడీలు దౌర్జన్యాలు ఎక్కువైపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన కలిసి ధైర్యంగా ఎదుర్కొంటాం. సుదీర్ఘ ఆలోచన కలిగిన తెలుగుదేశం పార్టీ, తెగింపు ఉన్న జనసేన యువత కలిపి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అందరూ కలిసిమెలిసి పనిచేస్తామని తెలియజేశారు.