తిరుపతి జనసేన శ్రేణులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికం
చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ మీకుటిల రాజకీయ దాస్టీకానికి పరాకాష్ఠ.. కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం, అసభ్య పదజాలాలతో దూషించడం మీకు కొత్త ఏమీ కాదు, మీరు చేయగలిగేది ఇదే కదా!
మిమ్మల్ని చూసి సామాన్య ప్రజలే భయపడటం లేదు, మరి పవన్ కళ్యాణ్ గారి జనసేవకులం, జనసైనికులం మేము ఎలా బయపడతాం..
కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కు తగ్గుతారు అనుకోవడం మీ భ్రమ. చాలు ఎంత కిందకి కొడితే ఏంత పైకి ఎగురుతుందో అందరికి తెలిసిన వాస్తవము అని గుర్తు పెట్టుకోవాలి.
భగవంతుడికి టెంకాయలు కొడితే కూడా కేసులంటే.. మీ మెదడు ఎక్కడుంది అనుకోవాలి?
హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ, హిందువులను అవమాణిస్తూ, వారి మనోభావాలను దెబ్బ తీసే చర్యలకు పూనుకొన్నారు, మిమ్మల్ని ఆదేవుడు కూడా రక్షించలేడు!.. రానున్న రోజుల్లో మీ చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు.