యాజలి నాగేశ్వరరావు కుటుంబానికి జనసేన నాయకుల ఆర్థిక సహాయం

బాపట్ల జిల్లా, రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి గ్రామంలో సీనియర్ జనసైనికుడు యాజలి నాగేశ్వరరావు ఇటివలే అనారోగ్యం కారణంగా మరణించారు.. ఆయన మొదటి నుంచి జనసేన పార్టీకి అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించారు.. గురువారం ఆయన కుటుంబాన్నీ పరామర్శించి జనసేన పార్టీ తరపున 50000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ యాజలి నాగేశ్వరరావు గారు జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు.. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది అన్నారు.. జిల్లా కార్యదర్శి మత్తె భాస్కరరావు మాట్లాడుతూ నాగేశ్వరరావు కుటుంబానికి అన్నిరకాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, కార్యదర్శి తాళ్ళూరి అప్పారావు, కార్యదర్శి చందోలు ప్రసాద్, గుంటూరు నగరజనసేనపార్టీ ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు, పొన్నూరు మండలం ప్రధాన కార్యదర్శి గరికిపాటి దుర్గారావు, కాజా నాగేశ్వరరావు, తాతా పోలేరయ్య, గోపికృష్ణ పాల్గొన్నారు.