ఆలూరు నియోజకవర్గాన్ని పేపర్ కే పరిమితం చేసిన నాయకులు

కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గాన్ని పేపర్ కే పరిమితం చేసిన నాయకులు కర్ణాటక సరిహద్దుల్లో ఉందని సాకుతో అభివృద్ధిని మరిచిపోయిన నాయకులు. ఆలూరు మండలంలో త్రాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన ఎంపిటిసి ఎరుకుల పార్వతి విమర్శించారు. ఆలూరు మండలం పరిస్థితి ఇలా ఉంటే చుట్టుపక్కల గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని ఇక్కడ ఉన్న నాయకులను అధికారులును మేము అడుగుతున్నామన్నారు. అధికారులు మాత్రం చుట్టపు చూపుగా చూసి వెళుతున్నారే తప్ప చుట్టుపక్కల గ్రామాలలో సమస్యలు అలాగే ఉండిపోయాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడం. విద్యార్థులకు బస్సులు సౌకర్యం లేకపోవడం. వైద్యం సౌకర్యం లేకపోవడం ఇలా చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆలూరు నియోజికవర్గంలో ఒక్కటే కాదు కర్నూల్ జిల్లాలో చాలా గ్రామాలలో ఇలాంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించాలని ఇక్కడ ఉన్న నాయకులను కోరుకుంటున్నానని ఆలూరు నియోజకవర్గం జనసేన ఎంపిటిసి
ఎరుకుల పార్వతి.