మల్లాడి దుర్గా ప్రసాద్ కి లక్ష రూపాయల ఆర్ధికసాయం

ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం, సిద్ధాంతం గ్రామ మత్స్యకార సామాజికవర్గ జనసైనికుడు మల్లాడి దుర్గా ప్రసాద్ కి పది నెలల క్రితం వేటకి వెళితే రక్త పింజరు పాము కాటు వేసి కాలు కుళ్ళింది, ఆయన కుటుంబానికి అండగా సిద్ధాంతం జనసేన నాయకులు దార్లంక మారుతి వారి మిత్రులు సిద్దూ ద్వారా కెట్టోలో ఫండ్ రెయిజ్ చేస్తే 41116(నలభై ఒక్క వేయి నూట పదహారు రూపాయలు) మరియు ఎన్ఆర్ఐ హుష్టన్ 30,000/- +సిద్దూ టక్కి అంపలపాటు 30,000/- మొత్తం లక్ష రూపాయల ఆర్ధిక సాయం గురువారం నర్సాపురం ఇంచార్జి, రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షులు, పిఏసి సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆఫీసులో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా పెనుగొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల బాబులు, జిల్లా ప్రముఖ మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఇవ్వడం జరిగింది.