మూత్ర పిండాల వ్యాధిగ్రస్తుడికి రూ.లక్ష ఆర్ధిక సాయం

కృష్ణా జిల్లా, మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన శ్రీ బొండాడ ఫణికుమార్ గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత కారణంగా ఇటీవల ఆయన కంటిచూపును కూడా కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీ ఫణికుమార్ కు కంటి శస్త్ర చికిత్స నిమిత్తం జనసేన పార్టీ మచిలీపట్నం ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని సమకూర్చారు. ఈ మొత్తాన్ని తెనాలిలో జరిగిన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన వేడుకల్లో చెక్ రూపంలో శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా శ్రీ ఫణికుమార్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బండి రామకృష్ణ, మచిలీపట్నం పట్టణానికి చెందిన వివిధ డివిజన్ల ఇంఛార్జులు పాల్గొన్నారు.