అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక తోడ్పాటు

రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గుబ్బల రాంబాబు కు వైద్య ఖర్చుల నిమిత్తం గల్ఫ్ యువ నేస్తం సేవా సమితి వారు ఇరవై వేల రూపాయిలను.. అలాగే ఘనసాల రామరాజు ఒక వేయ్యి రూపాయిలను ఆర్థిక తోడ్పాటుగా శనివారం రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు సమక్షంలో ఆయన చేతుల మీదుగా అందించారు. ఆర్థిక తోడ్పాటును అందించిన దాతలను వైస్ ఎంపీపీ ఇంటిపల్లి అభినందించారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గల్ఫ్ యువ నేస్తం సేవా సమితి చేస్తున్న సహాయ సహకారాలు విలువకట్టలేనివని ఇంటిపల్లి ఆనందరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఘనసాల బాలాజీ, కోళ్ల సత్తిబాబు, ఇంటిపల్లి నాని, కాండ్రేగుల శ్రీహరి, కాండ్రేగుల ప్రసాద్, సత్య, చైతన్య, గుబ్బల శివ శంకర్, కాండ్రేగుల నాగరాజు, కట్టా వాసు, నగరం నాని, కాండ్రేగుల జానికిరామ్, బొంతు రమేష్, కడలి కృష్ణార్జునుడు, దొంగ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *