జనసేన పార్టీ తరఫున బలుగూరి సాగర్ కుటుంబానికి ఆర్థిక సాహాయం

పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన పార్టీ మండల కార్యదర్శి బలుగూరి సాగర్ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సాగర్ కుటుంబాన్ని పరామర్శించి వారి కి 50 వేల రూపాయల చెక్ ని అందజేసీ వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం అదే రోడ్డు ప్రమాదానికి గురైన తన్నీరు గోపినాధ్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్బంగా బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ నెల 10 నుంచి 28 వరకు మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని కస్టపడి పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త తప్పనిసరిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులు నియోజకవర్గ నాయకులు వీరమహిళలు మండల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.