మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి టౌన్ 16వ వార్డులో ఆదివారం ఎస్సీ కులానికి సంబంధించిన తాళ్లూరి రమణయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు వి అప్పారావు వారి కుటుంబాన్ని పరామర్శించి మట్టి ఖర్చులు నిమిత్తం ఆర్థిక సాయం చేయడం జరిగింది. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి వి అప్పారావుతో పాటు జనసేన నాయకులు చిలక సత్యం, చిలకాపూర్ణ షేక్ కాసిం, షేక్ రఫీ చిలకాపున్నా రావు, అంకమ్మరావు, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నర్సయ్య, సత్తెనపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.