క్రియాశీల కార్యకర్త రమణకు జనసేన నేతల ఆర్ధిక సహకారం

రాజమహేంద్రవరం, స్థానిక లలితా నగర్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త అడబాల వీరవేంకట రమణకు వైద్య ఖర్చులు నిమిత్తం జనసేన పార్టీ తరపున 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ రావు అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అడబాల వీర వెంకటరమణ ను ఆయన ఇంటివద్ద శనివారం ఉదయం జనసేన పార్టీ నాయకులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తల కష్టాల్లో ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తమ పార్టీ నాయకులంతా అధినేత పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ శక్తి మేరకు పార్టీ కార్యకర్తలకు సహాయం చేస్తున్నామని అన్నారు. రమణ కుటుంబ సభ్యులకు అన్ని విధాల విధాల పార్టీ తరపున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు ఎస్.పి రాజు, దాసరి గురునాధ రావు, సబ్బా రాజేష్ ఖన్నా, ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా, కార్యదర్శి ప్రకాష్, ముమ్మిడి నాగరాజు, సురేష్ నాయుడు, మొండ్రేటి ప్రసాద్, రొక్కం రాము సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *