బొడ్లపాడు గ్రామంలో హర్ ఘర్ తీరంగా
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆజాదికా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీజీ ఆదేశాల మేరకు ఈనెల 13,14,15 తేదీలలో హర్ ఘర్ తీరంగా మహోత్సవ్ వేడుకల్లో పాల్గొనవలసినదిగా కోరడం జరిగింది. దీనిలో భాగంగా మన్యం జిల్లా బొడ్లపాడు గ్రామంలో మువ్వన్నెల జాతీయ జెండాను బొడ్లపాడు గ్రామంలో గ్రామ మహిళలుతో జాతీయ జెండాలు చేతిలో పట్టుకోని వీధి పర్యటన చేస్తూ.. ప్రతి ఇంటిపై జాతీయ ఎగురవేసి దేశంపై బొడ్లపాడు ప్రజలు ప్రతి ఒక్కరూ దేశ భక్తిని చాటే విధంగా శనివారం ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరూ జయప్రదం చేశారు.