మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం

కడప: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కడప 28వ డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షులు అల్లా బకాష్, మరియు డివిజన్ ఇంచార్జ్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో స్థానిక శారద నిలయం హైస్కూల్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కడప ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మరియు టిడిపి పార్టీ రాష్ట్ర నాయకులు పోలుదాసు కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పండ్రా రంజిత్ కుమార్, శేషు, వినయ్, ఉపేంద్ర, మణి, ఆలీ, టిడిపి పార్టీ నాయకులు రహమతుల్లా, జయకుమార్, నాగేంద్ర, సునీల్, గౌస్, రామ్ కి తదితరులు పాల్గొన్నారు.