అనకాపల్లిలో నా సేన కోసం…నా వంతు

అనకాపల్లి, నా సేన కోసం…నా వంతు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో విజయవంతంగా తీసుకువెళ్లేందుకు ఆదివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీల అధ్యక్షులు మరియు గ్రామ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా భాస్కరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 30 వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. దీనికి గాను ప్రతీ గ్రామంలో, ప్రతీ వార్డులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ సందర్బంగా హాజరైన నాయకులు, జనసైనికులు అందరూ తమ వంతుగా పార్టీ కి విరాళాలు పంపించారు.