బలిజ సంక్షేమ సంగం ఆధ్వర్యంలో వనబోజన కార్యక్రమం

రాజంపేట: కడపజిల్లా పరిధిలోని చింతకొమ్మదిన్నేలో బలిజ సంక్షేమ సంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనబోజన కార్యక్రమానికి ఆదివారం బలిజసంగం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు సుగవాసి బాల సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, సానిపాయి మాజీ సర్పంచ్ నేతి వెంకటరమణ, సుండుపల్లి మండల బలిజసంగం ఉపాధ్యక్షులు జయరామ్, ప్రధాన కార్యదర్శి చెన్నంశెట్టి రామాంజనేయులు, విశ్రాంత లక్షరర్ ఎ వి సుబ్బయ్య, రిటైడ్ యస్.ఐ.ఆర్ నాగయ్య, బలిజసంగం నాయకులు తోట రవీంద్ర, వెంకట నారాయణ, నాగసుబ్బయ్య, నాగరాజలు, నాగేష్, సిద్దయ్యలు, సిద్దు, రవీంద్రలు, రామంజులు, భాస్కర్, వెంకటేష్ లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.