ఐపీఎల్ 2020కి తెలుగు కామెంటేటర్‌గా మాజీ చీఫ్ సెలెక్టర్ MSK

ఐపీఎల్ 2020 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటంతో టీవీ వ్యూవర్‌షిప్ ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని స్టార్‌ స్పోర్ట్స్ అంచనా వేస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో కామెంట్రీ చెప్పే వ్యాఖ్యాతల జాబితాని తాజాగా విడుదల చేసింది.

తెలుగు కామెంటేటర్ జాబితాలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌కు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెస్కే.. తన వ్యాఖ్యానంతో తెలుగు అభిమానులను అలరించనున్నాడు. మరో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్‌ కూడా తమిళంలో కామెంట్రీ చెప్పుబోతున్నాడు.