శేరిలింగంపల్లి జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

శేరిలింగంపల్లి, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి గౌరవ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు 110 చందానగర్ డివిజన్ అద్యక్షులు అరుణ్ కుమార్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు నాయకత్వంలో స్థానిక జనసేన పార్టీ ఆఫీసు పి.జె.ఆర్ స్టేడియం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కాలని వాసులు మరియు పేద బడుగు బలహీనర్గాల ప్రజలు విశేషంగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరం సేవలను వినియోగించుకోవడం జరిగింది, స్వతహాగా నేత్ర వైద్యలైన డాక్టర్ మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కంటి వైద్య పరీక్షల అనంతరం కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. కంటిచూపు సమస్యలతో బాధపడే వారికి మెరుగైన సేవలందించేందుకు రానున్న కాలంలో మరన్నీ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని తెలియ చేశారు. అదేవిధంగా పరీక్షల అనంతరం వారి కంటి చూపుకు అవసరమైన కళ్లజోళ్లను 2-4 రోజులలో అందిస్తామని తెలియచేశారు. అలాగే సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ కో-ఆర్డినేటర్లు వీర మహిళలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.