పర్యావరణ పరిరక్షణలో విజయనగరం జనసేన

విజయనగరం, జనసేన పార్టీ 7 సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతమైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ యువ నాయకులు హుసేన్ ఖాన్ ఆధ్వర్యంలో కాలుష్యానికి అపరిశుభ్రత గురవుతున్న విజయనగరంలో గల అయ్యకోనేరు చెరువు శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పుష్ప కుమారి, జనసేన నాయకులు చక్రవర్తి, రౌతు సతీష్, సయ్యద్ బుఖారీ, జనసైనికులు భవాని, పండు, అబ్బాస్, జానీ, ఫరీద్, ఫిరోజ్, తదితరులు పాల్గొనడం జరిగింది.