గాంధీజీ మార్గం అన్ని తరాలకు ఆదర్శం: షేక్ మహబూబ్

ఆత్మకూరు నియోజకవర్గం: జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంత సాగరం మండల పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ గాంధీజీ చిత్ర చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజి గారు ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దాని నువ్వే నాంది పలికాలి. జాతి పిత మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన యోధుడు గాంధీజీ అన్నారు. గాంధీజీ మార్గం అన్ని తరాలకు ఆదర్శం అన్నారు.