టీం పిడికిలి గోడపత్రికని ఆవిష్కరించిన బండారు

కొత్తపేట, మన రాష్ట్రంలో ఇప్పటిదాకా గడిచిన మూడు సంవత్సరాలలో 3000 మందికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన జనసేన రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయా రైతుల వివరాలను సేకరించి వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందక పోవటంతో తనవంతుగా కుటుంబానికి ఒక లక్ష రూపాయలు స్వయంగా అందజేయడం, వాళ్ళ పిల్లల చదువులుకు కూడా సహకరిస్తారని చెప్పడం, అలాగే ఆచరణలో భాగంగా మొదటగా అనంతపురం జిల్లాలో కౌలు రైతు కుటుంబాలకు సాయం అందజేయడం, రెండో విడతగా వెస్ట్ గోదావరి రైతులకు, ఇప్పుడు మూడో విడతగా ఈ నెల 8 వ తారీఖు నుండి కర్నూల్ జిల్లా లో అందజేయడం జరుగుతుంది.. ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఎన్నారై జనసైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి ప్రచురించబడిన గోడ పత్రిక పోస్టర్లను శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజక వర్గ టీం పిడికిలి మెంబర్ వక్కపట్ల చంద్రశేఖర్, మహాదశ బాబులు, ఎలిశెట్టి శివ, కొత్తపేట టౌన్ ప్రెసిడెంట్ ఉమ, వార్డ్ మెంబర్ రమేష్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.