Gannavaram: ఆశావర్కర్లు, ఏఎన్ఎంలకు జనసేన సత్కారం

వెలుగుల పండుగ దీపావళిని పురస్కరించుకుని కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్సును జనసేనపార్టీ సత్కరించింది. కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు శ్రీ లంకే సురేష్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలకు నూతన వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు ముఖ్యఅతిధిగా విచ్చేశారు. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించి వారు చేసిన సేవలకు ప్రతి ఒక్కరు ఋణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.