వరద ముంపు ప్రాంతాలలో జనసేనచే పశుగ్రాసం పంపిణీ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం: వరదలకారణంగా ముంపుతో ఏటిగట్లు పైకి చేరి పశుగ్రాసం లేక అలమటిస్తున్న పాడిపశువులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశుగ్రాసం పంపిణీ చేయడంజరిగింది.

ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంకగ్రాలాలో రైతులు తమ వద్దకు వచ్చిన పలువురు పశుగ్రాసం కోసం ముంపుప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ చార్జి పితాని బాలకృష్ణ వద్ద రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు..

దీనిపై స్పందించిన బాలకృష్ణ తన సొంత ఖర్చులు 60 వేల రూపాయలతో నాలుగు ట్రాక్టర్ల ఎండుగడ్డి కొనుగోలు చేసి, లంకఫ్ తానేలంక, కమిని పల్గవారిపాలెం, తదితర ప్రాంతాల్లో ఏటుగట్లపై ఉంచిన గేదెలకు, ఆవులకు అందిచే నిమిత్తం రైతులకు అందజేశారు..

ఈ కార్యక్రమంలో గోదాసి పుండరీష్, సానబోయిన మల్లికార్జున రావు, జక్కంశెట్టి బాలకృష్ణ, గోలకోటి వెంక్కన్న బాబు, యలమంచిలి బాలరాజు, నాతి నాగేశ్వరావు, గుద్దటి విజయ్, దూడల స్వామి, మాదాల శ్రీధర్, గోలకోటి సాయి, నిమ్మన శ్రీను, చిట్టూరి దొరబాబు, మరియి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానూలు పాల్గొన్నారు.