నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో శివ దుర్గ కోవా సెంటర్ వారి ఆహ్వానం మేరకు నూతన షాప్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జనసేన నా సేన కోసం నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వారి వెంట శ్రీకృష్ణపట్నం గ్రామ ప్రసిడెంట్ కిమిడి శ్రీరామ్, యర్రంశెట్టి శ్రీను, చేపల సుబ్బు అనంతల గోవింద్, పేపకాయల నాగేశ్వరావు, సొడాసాని శ్రీనివాస్, ఈవూరి వీరబాబు, నాగవరుపు చెల్లారవు, దివాన్ చెరువు వేణు తదితరులు పాల్గొన్నారు.