జనసేన ఔదార్యం.. రోడ్డుపై గుంటలు పూడ్చిన జనసైనికులు

అద్దంకి నియోజకవర్గం: అద్దంకి ఇంచార్జ్ కంచర్ల కృష్ణ సహాయ సహకారంతో పంగులూరు మండల అధ్యక్షులు కసుకుర్తి వీరహనుమాన్ ఆద్వర్యంలో జె.పంగులూరు మండలంలో ముప్పావరం నుండి పంగులూరు రోడ్ లో వర్షాలకు బాగా గుంటలు పడ్డాయి.. ఈ రోద్ పై ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారటంతో స్పందించిన జనసేన నాయకులు గుంటలను పూడ్చటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేపు వీరాంజనేయలు, ఫణికుమార్, నాలి ప్రవీణ్, యస్వంత్ చందలూరి పాల్గొన్నారు.