కందుల దుర్గేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజమండ్రి రూరల్ జనసేన

జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్బంగా రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుర్గేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జి.రాజేశ్వరి, ఎస్.ఎన్ రాజు, విజయలక్ష్మి, సాయిరాం, భాస్కర్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.