జిజిహెచ్ కాంట్రాక్టు ఉద్యోగులని విధులలోకి తీసుకోవాలి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి జిజిహెచ్ లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 89 మంది కాంట్రాక్టు ఉద్యోగులని కోర్ట్ ఆర్డర్స్ కి వ్యతిరేకంగా ఏ నోటీసు ఇవ్వకుండా విధుల నుండి ప్రభుత్వం నిధుల కొరత పేరుతో తొలగించడం చాలా దారుణం. 15 నెలలు జీతాలు ఇవ్వకున్న కరోనాలాంటి భయానక పరిస్థితిలో విధులు చేసిన వీరిని మానవతా కోణంలో తిరిగి తీసుకోవాలి. వెంటనే ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలని, స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.