కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గిడ్డి

పి.గన్నవరం, జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల కూటమి పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి అయినవిల్లి మండలంలోని పొట్టిలంక, కొండుకుదురు గ్రామాలలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా అమలాపురం ఎంపీగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మాధుర్ కు తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ పై, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పై ఓటు వేసి ప్రజలందరూ గెలిపించాలని ఆయన కోరారు. ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.