గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 21వ రోజు

పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం 21వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండల కేంద్రంతో పాటు వివిధ పంచాయతీలలో ఉన్న ప్రభుత్వం కార్యాలయలు సందర్శించిన జనసైనికులు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ వీరఘట్టం మండలంలోని ప్రభుత్వం కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో ఐ.సి.డి.ఎస్, విద్యుత్ ఉప కేంద్ర, వ్యవసాయ శాఖ కార్యాలయం, తుడి, చిట్టపుడి వలసలో పశువైద్య శాలల పునాదులు బీటలు వారాయి. ఆర్.టి.సి బస్ స్టాప్ లేక ప్రయాణీకులు రోడ్ ప్రక్కన వేచి ఉండవలసి వస్తుంది. ప్రభుత్వం డిగ్రీ కళాశాల తరగతి గదులు లేక జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు పక్క భవనం నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. జనసేన జాని మాట్లాడుతూ చాలా గ్రామలలో స్మశానవాటికలకు రహాదారులు లేవు, మండల కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వచ్చు ప్రజలు సులబ్ కంప్లెక్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్.టి.సి బస్ కంప్లెక్ నిర్మాణం చేపట్టాలని, మండల కేంద్రంలో చేపట్టిన రోడ్ విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మండల పరిధిలోని గ్రామీణ రహదారులు బాగుచేయాలని కోరారు. కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు తాడేల శ్రీరాం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం కార్యాలయాలు వర్షాలకు శ్లాబ్లు పెచ్చులు ఊడుతున్నాయి, వర్షం నీరు గోడలద్వారా నీరు చిమ్ముతున్నాయి, కార్యాలయాలలోకి వర్షం నీరు చేరుతుంది. ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణం లో అధికారులు పర్వవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వం కార్యాలయాలు కాలం చెల్లక ముందే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి జనసైనికుడు ఆకుంటదీక్షతో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి పవన్, శంకర్రావులు పాల్గొన్నారు.