రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమం 5వ రోజు

  • పిఠాపురం జనసేన వైపు చూస్తుంది

పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి 24వ వార్డు కత్తులగూడెంలో ఆమె పర్యటించి, స్థానికుల సమస్యలు, వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనకు పిఠాపురంలోనే గాక రాష్ట్ర మొత్తం విశేష స్పందన లభిస్తుందని ఆన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మూడున్నర సంవత్సరాలు పైగా ఈ ఇబ్బందులు అనుభవించిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారని ఇది జనసేన గెలుపుకు శుభ సూచకమని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి సొంత అడపడుచుగా కష్టసుఖాలలో తోడు ఉంటాను అని స్థానిక ప్రజలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పుణ్యమంతుల మూర్తి, బుర్రా సూర్య ప్రకాష్, కాళ్ల రాజు, దేశి రెడ్డి సతీష్, సుబ్రమణ్యం, వినయ్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.