జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి: మేడ గురుదత్

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 45వ రోజులో భాగంగా మనపార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామం హరిజన పేట లో మంగళవారం కార్యక్రమం లో 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 43,000 గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామాన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీ ని కొణిదెల పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం లో కోరుకొండ మండల కన్వీనర్ మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, తన్నీరు తాతాజీ, అడపా అంజిబాబు, పోసిబాబు, చదువు ముక్తేశ్వరరావు, చల్లా ప్రసాద్ మరియు గ్రామ జనసేన కోటికేశవరం జనసేన పార్టీ నాయకులు పొట్నూరి అప్పన్న, జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీ గా పోటీచేసిన పొట్నూరి అచ్చియమ్మ, డి హరి, డిఎమ్ రాజు, డి పోతిరాజు, పి ఆకాష్, ఎస్ దుర్గా, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.