గుడ్ మార్నింగ్ సీఎం సార్… డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన ఇమ్మడి కాశీనాథ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజ్యలక్ష్మి కాలనీ నందు రోడ్ల అధ్వాన పరిస్థితి పై జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు అనేక సమస్యలను తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఈ రోడ్ల సమస్య వలన స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.