మైనారిటీ సోదరులకు జగన్ సర్కార్ కుచ్చు టోపీ

పలమనేరు నియోజకవర్గం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో ముస్లిం సోదరులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి రద్దు చేయడం చూస్తుంటే మోసం చేయడమే అని తెలియజేశారు, ప్రజలకు ఇచ్చిన నవరత్నాలలో అన్నీ ఎత్తేయడం దారుణం అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపుతారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు సందీప్ రాయల్, రూరల్ మండల అద్యక్షులు నాగరాజు, రాజశేఖర్, మైనారిటీ సెల్ నాయకులు అస్లామ్ మరియు సూరజ్, అర్షద్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.