అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బత్తుల

రాజానగరం: సీతానగరం మండలం, సీతానగరం లంకూరు గ్రామవాసి గాదంశెట్టి కృష్ణ ఇల్లు బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ సంభవించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం, బట్టలు ఇతరత్రా ఇంటి సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. జనశ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న వెంటనే రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పి… తక్షణ అవసరాల నిమిత్తం 25 కే.జి ల బియ్యం, 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి, రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరపున పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ…. ఈ వృద్ధ దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని, 40 సంవత్సరాల కష్టార్జితం పూర్తిగా బూడిదైపోయిన కారణంగా తక్షణమే స్పందించి, బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి, తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మట్ట వెంకటేశ్వరరావు ప్రశాంత్ చౌదరి, గరగట్టి ,చీకట్ల వీర్రాజు, మట్ట సురేష్,దాసరి రమేష్, బొమ్మిరెడ్డి సురేష్,వేగిశెట్టి రాజు, అడబాల బాబీ ఇతర నాయకులు, వీరమహిళలు దగ్ధమైన ఇల్లును సందర్శించారు.