ఘనంగా బొర్రా వెంకట అప్పారావు జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి మండలం, ధులిపాళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బొర్రా వెంకట అప్పారావు జన్మదిన పురస్కరించుకొని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, హరి ప్రసాద్, చక్రవర్తి మరియు కళ్యాణం శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది. రాజుపాలెం మండల జనసేన పార్టీ కార్యాలయంలో బొర్రా వెంకట అప్పారావు జన్మదినమును పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమం జరిగినది. అనంతరం సత్తెనపల్లి పట్టణంలో బొర్రా అప్పారావు అభిమానులు సత్తెనపల్లిలోని యాప్ అనాధ పిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమంలో స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే మల్లమాంబ అనాధ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగినది. సాయంత్రం ధూళిపాళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు, సత్తనపల్లి వార్డు కౌన్సిలర్, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ వారు, గ్రామ కమిటీ వారు, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, జనసైనికులు, వీరమహిళలు, భారీ జనసంద్రోహం మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం జరిగినది, అనంతరం 5000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, జనసైనికులకి, మిత్రులకి, సన్నిహితులకి కృతజ్ఞతలు తెలిపారు.