గుమ్మడి రాజు కుటుంబానికి అండగా నిలచిన సువర్ణ రాజు

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండలం, చిట్యాల గ్రామంలో అనారోగ్య కారణాల చేత చనిపోయిన గుమ్మడి రాజు కుటుంబాన్ని జనసేన గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు పరామర్శించి, జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది. అలాగే జనసేన పార్టీ తరపున చనిపోయిన వ్యక్తి పిల్లల పైచదువులకి సువర్ణరాజు బాధ్యత తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో జనసేన- తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఉన్న ఇల్లు పునర్నిర్మిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. కార్యమంలో పోసిన గణపతి, సూర్యభగవాన్, రాంలీలా, గెద్దాడ సత్యనారాయణ, మల్లిబాబు, శ్యామ్ బాబు, పవన్ కుమార్, నూతంగి శ్రీను, గుమ్మడి ఆరోల్, దేశభత్తుల వెంకటరావు, సాలి వెంకట రావు, కేబుల్ బాలు, బోడ పండు తదితరులు పాల్గొన్నారు.