ముదివర్తి ఘటన బాధ్యులను పరామర్శించిన గునుకుల కిషోర్

  • పొరబాటు జరిగితే దానిని కులానికి ఆపాదించి రెండు కులాలు కొట్టుకోవడం తప్పు

కోవూరు నియోజకవర్గం: ముదివర్తి గ్రామంలో శుక్రవారం దాడి జరిగిన బాధ్యులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులప్రాతిపదికన దాడులు జరగడం తప్పు, ఎవరైనా తప్పు చేస్తే వారిని చట్టపరంగా శిక్షించాలి అంతేకానీ ఆ తప్పును కులానికి అంటగట్టి ఇరువర్గాలు దాడి చేసుకోవడం అమానుష సంఘటన. రాజకీయ ఒత్తిడితో ఇటువంటి వాటికి పోలీసులు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదు. తలలు పగలగొట్టుకొని ముగ్గురు బాధితులు హాస్పిటల్ లో ఉంటే దాడి చేసిన వారిని వదిలేసి ముందుగా భాదితుల పై 307 ని కట్టడం ఎంతవరకు సబబు. దాడుల విషయంలో పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇరువర్గాలను శాంతింప చేయాలి. వ్యక్తి చేసిన తప్పును కులాన్ని అంట కట్టి ఇరువు వర్గాల మధ్య గొడవలను ఇంతటితో అరికట్టాలని కోరుకుంటున్నాను తెలిపారు.